కేంద్రమంత్రిని కలిసిన బాలీవుడ్ నటి
By: chandrasekar Thu, 08 Oct 2020 4:37 PM
కేంద్ర హోం శాఖ సహాయ
మంత్రి కిషన్ రెడ్డిని బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ కలిశారు. తనకు త్వరగా న్యాయం
జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తూ పాయల్
కిషన్ రెడ్డికి లేఖ అందజేశారు. ఇది చాలా
మంది ఎదుర్కొంటున్న సమస్య అని, ఇపుడు చర్యలు తీసుకునే సమయం వచ్చిందని ట్వీట్
లో పాయల్ తెలిపారు.
బాలీవుడ్ నటి పాయల్
ఘోష్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి
తెలిసిందే. పాయల్ ఘోష్ ఫిర్యాదు మేరకు
ముంబై పోలీసులు అనురాగ్ కాశ్యప్ పై అత్యాచారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో
పోలీసులు అనురాగ్ కాశ్యప్ ను సుమారు 8 గంటలు విచారించారు.
పాయల్ తనపై చేస్తున్న
ఆరోపణలు నిరాధారమైనవని అనురాగ్ ఇప్పటికే తీవ్రంగా ఖండించాడు. ఈ కేసులో తనకు
న్యాయం చేయాలని కోరుతూ పాయల్ మంగళవారం ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ ను
ఆశ్రయించిన విషయం కూడా తెలిసిందే.