Advertisement

  • న్యాయం చేయాలి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన బాలీవుడ్ నటి

న్యాయం చేయాలి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన బాలీవుడ్ నటి

By: Sankar Wed, 07 Oct 2020 8:40 PM

న్యాయం చేయాలి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన బాలీవుడ్ నటి


బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై నటి పాయల్ ఘోష్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను వేధించాడని పాయల్ చెప్పుకొస్తుంది. తనను రూమ్ కి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. నేను ఏ హీరోయిన్ ని పిలిచినా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుందని అతడు చెప్పాడని చెప్పింది పాయల్ .

అనురాగ్ కశ్యప్ తర్వాత తాను మరే దర్శకుడి నుంచి అలాంటి అనుభవాలను ఎదురుకోలేదని తెలిపింది. ఈ వ్యవహారంలో దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై నటి పాయల్ ఘోష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాయల్ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు అనురాగ్ కాశ్యప్ పై అత్యాచారం కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసులో అనురాగ్ కాశ్యప్ ను పోలీసులు సుమారు 8 గంటలు విచారించారు.

పాయల్ తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని అనురాగ్ ఇప్పటికే తీవ్రంగా ఖండించాడు. తాజాగా పాయల్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డినికలిసింది. తనకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తూ కిషన్ రెడ్డికి పాయల్ లేఖ అందజేశారు. ఆ విషయాన్నీ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది

Tags :
|

Advertisement