షూటింగ్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన కంగనా రనౌత్
By: Sankar Fri, 02 Oct 2020 4:44 PM
బాలీవుడు నటి కంగనా రౌనత్ ఈ మధ్య వార్తల్లో బాగా వస్తోంది. మహా సీఎం థాక్రేతో పాటు సోనియా లక్ష్యంగా కంగనా విమర్శలు కొనసాగించింది… కంగనా భద్రత కోరటంతో ఆమెకు కేంద్రం వై-కేటగిరి భద్రత కల్పించింది.
తాజాగా హైదరాబాద్ చేరుకుంది కంగనా రౌనత్. షూటింగ్ నిమిత్తం కంగనా రనౌత్ హైదరాబాద్ వచ్చింది. పది రోజుల పాటు హైదరాబాద్ ఉంటూ..షూటింగ్ లో కంగనా పాల్గొననుంది. అయితే... కంగనా రనౌత్ పర్యటనను గోప్యంగా అధికారులు ఉంచారు. కంగనారనౌత్ ప్రస్తుతం " వై" కేటగిరి సెక్యూరిటీలో ఉంది. అటు తెలంగాణ అధికారులు కూడా పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నారు.
పది రోజుల పాటు రామోజీ ఫిలిం సిటీలో కంగనా రనౌత్ షూటింగ్ లో పాల్గొననుంది. కాగా.. కొన్ని రోజుల నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కంగనారనౌత్.. సుశాంత్ ఆత్మహత్య తర్వాత వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్రబిందువుగా మారింది కంగనారనౌత్.