Advertisement

  • కరోనా వలన మృతి చెందిన బోధన్ మున్సిప‌ల్ కౌన్సిలర్

కరోనా వలన మృతి చెందిన బోధన్ మున్సిప‌ల్ కౌన్సిలర్

By: Sankar Thu, 30 July 2020 10:13 PM

కరోనా వలన మృతి చెందిన బోధన్ మున్సిప‌ల్  కౌన్సిలర్



బోధ‌న్ మున్సిప‌ల్ కౌన్సిలర్, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఎం. గుణప్రసాద్ కోవిడ్ -19 తో మరణించారు. గుణప్రసాద్ బోధన్ మున్సిపాలిటీలో సీనియర్ కౌన్సిలర్. 1995 నుండి నాలుగుసార్లు కౌన్సిల‌ర్‌గా ఎన్నికయ్యారు. మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. గుణ‌ప్ర‌సాద్‌, ఆయ‌న భార్య కొద్ది రోజుల క్రితం కోవిడ్ -19 భారిన పడ్డారు. హైదరాబాద్ న‌గ‌రంలోని దక్కన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆయ‌న గురువారం మృతిచెందారు.

కొన్ని రోజుల‌క్రితం బోధ‌న్ ఏరియా ఆస్ప‌త్రి స్టాఫ్ న‌ర్సులు ముగ్గురు, వారి కుటుంబ స‌భ్యులు కోవిడ్‌-19 భారిన ప‌డ్డారు. అదేవిధంగా బోధ‌న్ ప‌ట్ట‌ణానికి చెందిన ఓ ఎల్ఐసీ ఏజెంట్ ఈ వ్యాధి భారిన ప‌డ్డాడు. వీరింతా ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్నారు.

కాగా రాష్ట్రంలో గ‌త 24 గంట‌ల్లో కొత్తగా 1,811 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, 13 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 60,717కు చేరింది. అదేవిధంగా మృతులు 505కకు పెరిగారు. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల్లో 15,640 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, 44,572 మంది బాధితులు కోలుకున్నారు. ఈమేర‌కు రాష్ట్ర వైద్య‌ఆరోగ్య శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది.

Tags :
|
|

Advertisement