బీహార్ లో ఘోర పడవ ప్రమాదం ...పదుల సంఖ్యలో గల్లంతు అయిన ప్రయాణికులు
By: Sankar Thu, 05 Nov 2020 8:22 PM
బీహార్లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. భాగల్పూర్లోని గోపాల్గంజ్ ప్రాంతంలోని గంగానదిలోని నవగాచియా టీన్షాంగ్ షిప్ ఘాట్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, 70 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో పడవలో వందమంది వరకు ఉన్నట్లు సమమాచారం. 30 మంది సురక్షితంగా బయటపడగా.. మిగిలినవారి ఆచూకీ లభ్యం కాలేదని అన్నారు. రెస్క్యూటీమ్ సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రమాదం నుంచి బయటపడ్డ రేణు దేవీ అనే మహిళ మాట్లాడుతూ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పలు విషయాలు వెల్లడించింది. దాదాపు 100మందికి పైగా బోటు ప్రయాణిస్తుర్నాని తెలిపింది. ఒక్కసారిగా పడవ నీటిలో మునిగిపోవడం జరిగిందని తెలిపింది.
తనను రెస్క్యూ సిబ్బంది ఎలా ప్రాణాలతో కాపాడారో తనకే తెలియదంది. అనేకమంది నీటిలో గల్లంతయ్యారని రేణు దేవీ పేర్కొంది. దీంతో ఘటన స్థలానికి బాధితుల బంధువులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. తమవారి ఆచూకీ కోసం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు