జేపీ నడ్డా కాన్వాయ్పై జరిగిన రాళ్ల దాడిపై నిరసన తెలిపిన బీజేపీ
By: Sankar Fri, 11 Dec 2020 5:34 PM
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై కోల్కతాలో గురువారం జరిగిన రాళ్ల దాడిని ఖండిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు ముంబైలో శుక్రవారంనాడు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై చర్య తీసుకోవాలని కోరుతూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ కోషియారిని కలుసుకుని మెమొరాండం సమర్పించేందుకు గవర్నర్ హౌస్ వరకూ కార్యకర్తలు నిరసన మార్చ్ నిర్వహించారు. 'బెంగాల్ సిటిజన్ ఆఫ్ ఇండియా' సభ్యులు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇక వెస్ట్ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నేతలు పరస్పరం ఆరోపణలతో మాటల యుద్ధానికి దిగుతున్నారు. తమ నాయకుడిపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ హెచ్చరించగా.. బీజేపీ వాళ్లకు పనేమీ లేదని ఓసారి హోం మంత్రి, మరోసారి చద్దా, నద్దా, ఫద్దా లాంటి వాళ్లు ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడతారంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా విమర్శించారు. ఔట్సైడర్స్ కారణంగానే ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆరోపించారు.