Advertisement

  • గత ఎన్నికల్లో మోసపోయాము...తిరిగి మహారాష్ట్రలో అధికారంలోకి వస్తాము .... జెపి నడ్డా

గత ఎన్నికల్లో మోసపోయాము...తిరిగి మహారాష్ట్రలో అధికారంలోకి వస్తాము .... జెపి నడ్డా

By: Sankar Fri, 09 Oct 2020 07:11 AM

గత ఎన్నికల్లో మోసపోయాము...తిరిగి మహారాష్ట్రలో అధికారంలోకి వస్తాము .... జెపి నడ్డా


మహారాష్ట్రలో 2019 ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. 100కు పైగా స్థానాలను పార్టీ గెలుచుకుంది.

అయితే, ఎన్నికల తరువాత అధికారం విషయంలో రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తడంతో, రెండు పార్టీలు విడిపోయాయి. శివసేన పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఇదిలా ఉంటె, త్వరలోనే మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు.

మహారాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్ర ప్రజలు ఫడ్నవిస్ ను ముఖ్యమంత్రిగా కోరుకున్నారని, కానీ, గత ఎన్నికల్లో తమకు ఎక్కువ స్థానాలు లభించినా మోసపోయామని అన్నారు. త్వరలోనే మహారాష్ట్ర ప్రజల కోరిక నెరవేరుతుందని, ఫడ్నవిస్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. మహారాష్ట్రలో నిజమైన ప్రతిపక్షంగా బీజేపీ ఉందని, త్వరలోనే అధికారం చేపట్టబోతుందని జేపీ నడ్డా తెలిపారు.

Tags :
|
|

Advertisement