సీఎం కెసిఆర్ పై విమర్శలు గుప్పించిన బండి సంజయ్
By: Sankar Mon, 07 Dec 2020 9:35 PM
సీఎం కేసీఆర్ భారత్ బంద్కు మద్దతివ్వడం సిగ్గు చేటు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ వైఖరితో తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటోందన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల నుంచి తప్పించుకునేందుకు కేసీఆర్ వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతులకు మంచి జరిగే చట్టాలను కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. 30 లక్షల ఎకరాల్లో సన్న రకం వడ్లు వేయించారు.. కేసీఆర్ ఫామ్హౌస్లో మాత్రం దొడ్డు వడ్లు పండించారని బండి సంజయ్ వెల్లడించారు..
రైతులను తప్పుదోవ పట్టించేలా సీఎం కేసీఆర్ తీరు ఉందని బీజేపీ మహిళా నేత డీకే అరుణ విమర్శించారు. రైతులకు మేలు చేసే చట్టాలని మోదీ తీసుకొచ్చారని వివరించారు. తెలుగు రాష్ట్రాల రైతులు అపోహలు నమ్మొద్దని కోరారు.