Advertisement

  • గ్రేటర్ ఎన్నికలలో సత్తాచాటిన బీజేపీ ..2023 ఎన్నికలలో విజయమే లక్ష్యం అని ప్రకటించిన బండి సంజయ్

గ్రేటర్ ఎన్నికలలో సత్తాచాటిన బీజేపీ ..2023 ఎన్నికలలో విజయమే లక్ష్యం అని ప్రకటించిన బండి సంజయ్

By: Sankar Fri, 04 Dec 2020 7:46 PM

గ్రేటర్ ఎన్నికలలో సత్తాచాటిన బీజేపీ ..2023 ఎన్నికలలో విజయమే లక్ష్యం అని ప్రకటించిన బండి సంజయ్


జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అనూహ్యంగా ఫుంజుకుంది. మొత్తం 150 డివిజన్లకు గానూ 49 స్థానాల్లో విజయం సాధించి గ్రేటర్‌లో సత్తా చాటింది.

2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేవలం నాలుగే సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి మాత్రం 49 సీట్లను కైవసం చేసుకుంది.ఈ నేపథ్యంలో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో సంబరాలు షురూ అయ్యాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంతత్రి కిషన్‌ రెడ్డితో పాటు డీకే అరుణ, లక్క్ష్మణ్‌లు కలిసి కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలతో కలిసి బాణాసంచా కాల్చారు.

అనంతరం ఒ‍కరినొకరు స్వీట్లు పంచుకొన్న బీజేపీ నేతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాగా 2023లో తెలంగాణలో అధికారమే లక్క్ష్యంగా పనిచేస్తామని బండి సంజయ్‌ పేర్కొన్నారు

Tags :
|
|

Advertisement