Advertisement

  • తెరాస ,ఎంఐఎంలను మట్టికరిపించడమే బీజేపీ లక్ష్యం ...లక్ష్మణ్‌

తెరాస ,ఎంఐఎంలను మట్టికరిపించడమే బీజేపీ లక్ష్యం ...లక్ష్మణ్‌

By: Sankar Mon, 16 Nov 2020 04:44 AM

తెరాస ,ఎంఐఎంలను మట్టికరిపించడమే బీజేపీ లక్ష్యం ...లక్ష్మణ్‌


తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్‌ ఎన్నికల కంటే ముందే బీజేపీ భారీగా చేరికలుంటాయని.. బీజేపీలోకి వలసలు ఆపటానికే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జీహెచ్ఎసీ ఎన్నికలకు వెళ్తున్నారని లక్ష్మణ్‌ చెప్పారు.

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలే గ్రేటర్‌ ఎన్నికల్లోనూ పునరావృతం కాబోతున్నాయని ఆయన తెలిపారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ తో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. కరోనా, వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఫైర్‌ అయ్యారు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎంలను మట్టి కరిపించడమే బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు.

అంతకుముందు బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం బండి సంజయ్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో గ్రేటర్‌ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి, అధికార పార్టీని ఎలా ఎండగట్టాలనే అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. బీజేపీలో చేరే ఇతర పార్టీ నేతలను కలుపుకుని పోవాలని బండి సంజయ్‌ దిశా నిర్దేశం చేసినట్టు సమాచారం.

Tags :
|
|
|

Advertisement