దుబ్బాక ఉప ఎన్నిక ..మళ్ళీ ఆధిక్యంలోకి దూసుకొచ్చిన బీజేపీ
By: Sankar Tue, 10 Nov 2020 3:26 PM
దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలు హోరాహోరీగా సాగుతున్నాయి. 21వ రౌండ్ పూర్తి అయ్యేసరికి బీజేపీ 620 ఓట్లు ఆధిక్యం సాధించింది. 21వ రౌండ్లో టీఆర్ఎస్కు 2,048, బీజేపీ – 2,428 ఓట్లు, కాంగ్రెస్- 845 ఓట్లు వచ్చాయి. ఇక ఇప్పటివరకు టీఆర్ఎస్కు 57,541, బీజేపీకి 58,161, కాంగ్రెస్కు 20,268 ఓట్లు వచ్చాయి.
కారు జోరు కొనసాగుతున్న వేళ అనూహ్యంగా 20వ రౌండ్లో బీజేపీ పార్టీ ముందుకు దూసుకు వచ్చింది. 100 ఓట్ల ఆధిక్యం సాధించింది. అయితే 20వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ 491 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చింది. ఇక ఉత్కంఠగా సాగుతున్న దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో మరో 3 రౌండ్ల ఫలితాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. చేగుంట, నార్సింగి మండలాల ఫలితంపై ప్రభావం చూపనున్నాయి.
ఇక మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చివరి రౌండ్లలో చతికిల పడిపోయింది. తొలి ఐదు రౌండ్లు, 8, 9, 11 రౌండ్లలో బీజేపీ మెజార్టీ సాధించగా, టీఆర్ఎస్ పార్టీ 6, 7, 13, 14, 15,16 రౌండ్లలో భారీ మెజార్టీగా దిశగా దూసుకెళ్లింది. 15, 16 రౌండ్లలో 1500 మెజార్టీ సాధించి.. విజయం దిశగా వెళ్తుంది. 15వ రౌండ్లో 955 ఓట్ల మెజార్టీ సాధించగా, 16వ రౌండ్లో 749 ఓట్లు సాధించింది టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కేవలం 12వ రౌండ్లో ఆధిక్యం సాధించింది