Advertisement

  • హైదరాబాద్ మార్పు బీజేపీతోనే సాధ్యం ..బండి సంజయ్

హైదరాబాద్ మార్పు బీజేపీతోనే సాధ్యం ..బండి సంజయ్

By: Sankar Mon, 23 Nov 2020 9:07 PM

హైదరాబాద్ మార్పు బీజేపీతోనే సాధ్యం ..బండి సంజయ్


ఇద్దరు ముఖ్యమంత్రులు కావాలా? ఒక్కరే సీఎంగా ఉండాలో హైదరాబాద్ ప్రజలు తేల్చుకోవాలని బండి సంజయ్ అన్నారు. పాత బస్తీలో ప్రచారం చేసే దమ్ము సీఎం కేసీఆర్ కు లేదు. పాతబస్తీ నుంచి దేశ ద్రోహులను తరిమికొడతాం అని పేర్కొన్నారు.

హైదరాబాద్ మార్పు బీజేపీతోనే సాధ్యం. గ్రేటర్ ను పాలించే అవకాశం ఒక్క సారి బీజేపీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. ఇక పై భాగ్యలక్ష్మీ దేవాలయం దగ్గరే మా అడ్డా పెడ్తాం. అభివృద్ధి, రాజకీయంగా హైదరాబాద్ మారాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ అభివృద్ధిపై టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇస్తామని పేదలను ప్రభుత్వం మోసం చేసింది.

ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్రభుత్వం నిరుద్యోగులతో ఆడుకుంటోంది అన్నారు. కేసీఆర్, కేటీఆర్ తీరుతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. వరద బాధితులను ముఖ్యమంత్రి పరామర్శించకపోవటం బాధాకరం. ప్రభుత్వానికి దమ్ముంటే తనను అరెస్టు చేయాలి అని బండి సంజయ్ పేర్కొన్నారు.

Tags :
|
|

Advertisement