డిన్నర్కు రావాలని ప్రియాంకను ఆహ్వానించిన బీజేపీ ఎంపీ అనిల్ బలూనీని
By: chandrasekar Tue, 28 July 2020 6:51 PM
కుటుంబంతో కలిసి డిన్నర్కు
రావాలని ప్రియాంకను ఆహ్వానించిన బీజేపీ ఎంపీ అనిల్ బలూనీని. కాంగ్రెస్ పార్టీ
ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా
బీజేపీ ఎంపీ అనిల్ బలూనీని టీ కోసం ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే
ఆయన ఈ మధ్యే కాన్సర్కు డయాలసిస్ చేసుకున్న కారణంగా రాలేనని ప్రియాంకకు
తెలియజేశారు. దీంతో పాటు కుటుంబంతో కలిసి
డిన్నర్కు రావాలని ప్రియాంకను ఆయన ఆహ్వానించారు. ప్రత్యేకమైన ఉత్తరఖండ్ మీల్స్ను
ఆయన ప్రియంక గాంధీ వాద్రా కుటుంబం కోసం తయారుచేయించనున్నారు.
ప్రియాంక 1997 నుంచి తన కుటుంబంతో కలిసి ఢిల్లీలోని లోధీ స్టేట్
బంగ్లాలలో నివసిస్తున్నారు. అయితే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రియాంకకు స్పెషల్
ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతను ఉపసంహరించుకోవడంతో ఆమె ఆ బంగ్లా నుంచి
ఆగస్టు 1లోపు ఖాళీ చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ జూలై 1న నోటీసులు జారీ చేసింది. ఈ నివాసాన్ని బీజేపీ
ఎమ్మెల్యే అనిల్ బలూనికి కేటాయించిన విషయం తెలిసిందే. లోధీ ఎస్టేట్లో ప్రభుత్వ
బంగ్లాను ఖాళీ చేసి హరియాణలోని గురుగ్రాంకు ప్రియాంక తాత్కాలికంగా మకాం
మార్చనున్నారు. ప్రస్తుతం అనిల్ బలూని గురుద్వారాలోని గవర్నమెంట్ బంగ్లాలో
నివసిస్తున్నారు.