Advertisement

  • భారత బంద్ కు తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలపడం హాస్యాస్పదం ...బీజేపీ నేత రాజా సింగ్

భారత బంద్ కు తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలపడం హాస్యాస్పదం ...బీజేపీ నేత రాజా సింగ్

By: Sankar Tue, 08 Dec 2020 12:14 PM

భారత బంద్ కు తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలపడం హాస్యాస్పదం ...బీజేపీ నేత రాజా సింగ్


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే..ఈ భారత్‌ బంద్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.

రైతుల సంక్షేమం కోసం కేంద్రం ఒక చట్టం తీసుకువస్తే.. ప్రతిపక్షాలు మాయమాటలతో రైతులను పక్కదారి పట్టిస్తున్నాయని మండిపడ్డారు. భారత్ బంద్ కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలపడం హాస్యాస్పదంగా ఉందని... రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ అని ఫైర్‌ అయ్యారు.

రైతుల భూములను కబ్జా చేసి వెంచర్లు చేసింది కేసీఆర్ అని.. దళారుల చేతుల్లో రైతాంగం మోసపోవద్దనే మోడి మంచి చట్టం తెచ్చారని కొనియాడారు. ఈ చట్టాలపై పూర్తి స్థాయిలో రైతులు అవగాహన పెంచుకోవాలని.. ప్రతిపక్షాలు కేంద్రంను, మోడీ ని లక్ష్యంగా చేసుకున్నాయని అన్నారు. అంతేకాదు... ప్రధాని మోదీ ఒక వ్యక్తి కాదు... ఒక శక్తి అని పొగిడారు రాజాసింగ్‌.

Tags :

Advertisement