Advertisement

  • బీజేపీ వల్లే కెసిఆర్ కు నిరుద్యోగులు గుర్తుకువచ్చారు ..బీజేపీ నాయకురాలు విజయశాంతి

బీజేపీ వల్లే కెసిఆర్ కు నిరుద్యోగులు గుర్తుకువచ్చారు ..బీజేపీ నాయకురాలు విజయశాంతి

By: Sankar Tue, 15 Dec 2020 10:09 PM

బీజేపీ వల్లే కెసిఆర్ కు నిరుద్యోగులు గుర్తుకువచ్చారు ..బీజేపీ నాయకురాలు విజయశాంతి


తెలంగాణాలో యాబై వేల ఉద్యోగాల భర్తీకి ప్రక్రియను ప్రభుత్వం మొదలుపెట్టిన విషయం తెలిసిందే..అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ ప్రకటనపై బీజేపీ నాయకురాలు విజయశాంతి కెసిఆర్ మీద తీవ్ర విమర్శలు చేసారు...అటు దుబ్బాకలోను, ఇటు జీహెచ్ఎంసీలో బీజేపీ దూకుడు దెబ్బకు కేసీఆర్ దొరగారికి ఒక్కసారిగా నిరుద్యోగులు గుర్తుకొచ్చారు.

ఉద్యోగార్థులను ఆరేళ్ళుగా పూచికపుల్లలా తీసిపడేసిన సీఎం గారు ఆదరాబాదరాగా 50 వేల ఉద్యోగాల భర్తీ అంటూ పొలికేక పెట్టారు. మన ఉద్యోగాలు మనకు.. మన నీళ్ళు మనకు అంటూ ఎప్పుడో ఉద్యమకాలంలో నినదించి, అధికారపగ్గాలు అందుకోగానే ఆ విషయం మర్చిపోయారు. బీజేపీ విజయాలు కేసీఆర్ గారికి దడపుట్టించి నిరుద్యోగులు జ్ఞాపకానికి వచ్చారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి రెండేళ్ళుగా జోనల్ సిస్టంను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. టీచర్ల ఏకీకృత సర్వీసు అంశంలో కేంద్రహోంశాఖ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వలేదు.

రెండు జిల్లాల నిరుద్యోగులకు అన్యాయం జరిగే పరిస్థితి నెలకొంది. సవరించిన జోన్లకు రాష్ట్రపతి ఆమోదం అవసరం. ఇవిగాక మరెన్నో చిక్కులు దీనితో ముడిపడి ఉన్నాయి. ఇవేమీ తేలకుండా కొత్త పోస్టుల భర్తీ అంత తేలిక కాదు. నిరుద్యోగులను మరోసారి ధోకా చేసే ప్రయత్నాలను రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో సాగవని ఈ మోసాల ముఖ్యమంత్రిగారు గమనించాలి. అంటూ విజయశాంతి పేర్కొంది.

Tags :

Advertisement