Advertisement

  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరికి కరోనా పాజిటివ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరికి కరోనా పాజిటివ్

By: Sankar Wed, 30 Sept 2020 11:31 AM

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరికి కరోనా పాజిటివ్


ఏపీ లో కరోనా కేసులు తీవ్ర స్థాయిలోనే నమోదు అయితున్నాయి..సాధారణ ప్రజలే గాక రాజకీయ నాయకులూ కూడా కరోనా బారిన పడుతున్నారు..తాజాగా ఏపీ బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి కరోనా బారిన పడ్డారు. ఆమెకు అనారోగ్యంగా ఉండడంతో టెస్టులు చేయించుకోగా... కరోనా పాజిటివ్‌గా తేలింది.

దీంతో హైద్రాబాద్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో ఆమె ట్రీట్మెంట్‌ తీసుకుంటున్నారు. ఇటీవలే ఆమెను జాతీయ ప్రధాన కార్యదర్శిగా బీజేపీ ప్రకటించింది. ఇదే క్రమంలో నేతలు, కార్యకర్తలు ఆమెకు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక మరో పక్క దేశంలో కూడా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్నటి రోజున కాస్త తగ్గినట్టు కనిపించినా ఈరోజు రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కేసులు తిరిగి పెరిగాయి.

తాజా బులెటిన్ ప్రకారం, ఇండియాలో కొత్తగా 80,472 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 62,25,764కి చేరింది. ఇందులో 9,40,441 కేసులు యాక్టివ్ గా ఉంటె, 51,87,826 మంది కోలుకొని ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు

Tags :
|
|

Advertisement