దుబ్బాక ఉప ఎన్నిక ..బీజేపీ అభ్యర్థిపై సొంత పార్టీ నేతల విమర్శలు
By: Sankar Wed, 07 Oct 2020 3:18 PM
దుబ్బాకలో బీజేపీ రాజకీయం హీటెక్కింది. పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు, పార్టీ నేతల పై బీజేపీ నేత కమలాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రఘనందన్రావు అభ్యర్థిత్వాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. రఘనందన్రావు లాంటి వ్యక్తికి టిక్కెట్ ఇస్తే...పార్టీ తీవ్రంగా నష్టపోతుందన్నారు.
అలాంటి వ్యక్తికి దుబ్బాక టిక్కెట్ ఇవ్వడం సరికాదని...దీంతో బీజేపీ ప్రతిష్ట దిగజారుతోందని కమలాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక టిక్కెట్ విషయంలో బీజేపీ పార్టీ పునరాలోచించుకోవాలని సూచించారు. అయితే... పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు పై ఆరోపణలు చేసిన కమలాకర్ రెడ్డిపై బీజేపీ సీరియస్ అయింది. టీఆర్ఎస్ నేతలకు అమ్ముడు పోయి కమలాకర్ రెడ్డి తమ నేతలపై ఆరోపణలు చేశారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు... తోట కమలాకర్ రెడ్డిని పార్టీ నుండి బహిష్కరించి పార్టీ. ఇది ఇలా ఉండగా...దుబ్బాక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దూసుకుపోతున్నాయి. దుబ్బాక గడ్డపై ఎవరు జెడ్డా ఎగరవేస్తారనే దానిపై క్లారిటీ రావాలంటే నవంబర్ 10 వరకు ఆగాల్సిందే..