Advertisement

  • ప్రధాని మోడీ రైతుల పక్షపాతి ..బీజేపీ నేత డీకే అరుణ

ప్రధాని మోడీ రైతుల పక్షపాతి ..బీజేపీ నేత డీకే అరుణ

By: Sankar Sun, 20 Dec 2020 7:00 PM

ప్రధాని మోడీ రైతుల పక్షపాతి ..బీజేపీ నేత డీకే అరుణ


నారాయణ పేట జిల్లా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నేత డీకే అరుణ మాట్లాడుతూ కేసీఆర్ ఒక మాయల మరాఠీ అని..అబద్ధాలలో దేశంలోనే నంబర్ వన్ సీఎం అన్నారు...

రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా కేసీఆర్‌ పూర్తిచేయలేదని.. సన్న వడ్లు వేసుకొమ్మని.. ఇప్పుడు రైతుల దిక్కు చూడటం లేదని ఆగ్రహించింది. దుబ్బాకలో ఎన్నికలు ఉంటే జనగామలో మీటింగ్ పెట్టి ఆదుకుంటామని చెప్పి.. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియని ఫైర్‌ అయ్యారు.

రైతుల పట్ల ప్రేమ ఉన్న నాయకులు ఎవరైనా.. రైతు చట్టాలను వ్యతిరేకించరని...నరేంద్రమోడీ రైతుల పక్షపాతి అని తెలిపారు. కేసీఆర్ కు సోయి ఉంటే.. ఇప్పటికే పాలమూరులో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని తెలిపారు. తెలంగాణలో రేపు వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని.. పాలమూరు, జడ్చర్ల, నారాయణ పేట, కొడంగల్, పరిగి, వికారాబాద్ అన్ని నియోజకవర్గాలకు సాగు నీరు వస్తుందని హామీ ఇచ్చారు డీకే అరుణ.

Tags :
|
|

Advertisement