Advertisement

  • బ్రేకింగ్ న్యూస్: కరోనాతో మరో కేంద్ర మంత్రి మృతి

బ్రేకింగ్ న్యూస్: కరోనాతో మరో కేంద్ర మంత్రి మృతి

By: Anji Thu, 24 Sept 2020 06:33 AM

బ్రేకింగ్ న్యూస్: కరోనాతో మరో కేంద్ర మంత్రి మృతి

బీజేపీ నేత,కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి కన్నుమూశారు. ఆయన వయసు 65 ఏళ్లు. కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈనెల 11న కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించారు. ఆయన కర్ణాటకలోని బెల్గాం స్థానం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు.

వరుసగా నాలుగుసార్లు(2004,09,14,19) పార్లమెంటుకు ఎంపికయ్యారు. కేరళలో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 5,376 మంది మహమ్మారి బారినపడ్డారు. మరో 20 మరణాలతో.. మొత్తం మృతుల సంఖ్య 592కి చేరింది. మొత్తం కేసులు లక్షా 50 వేలకు చేరువలో ఉన్నాయి.

కర్ణాటకలో కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. బుధవారం.. 6,997 కరోనా కేసులు బయటపడ్డాయి. మరో 38 మంది మరణించారు.బిహార్లో 1598 కొత్త కేసులు.. ఒక మరణం నమోదైంది. రాష్ట్రంలో మొత్తం కేసులు 1.73 లక్షలకు చేరుకున్నాయి. ఇప్పటివరకు 874 మంది చనిపోయారు

Tags :
|

Advertisement