Advertisement

  • గ్రేటర్ ఎన్నికలలో గొప్పగా పుంజుకున్న బీజేపీ ...రెండవ అతిపెద్ద పార్టీగా అవతరణ

గ్రేటర్ ఎన్నికలలో గొప్పగా పుంజుకున్న బీజేపీ ...రెండవ అతిపెద్ద పార్టీగా అవతరణ

By: Sankar Fri, 04 Dec 2020 9:39 PM

గ్రేటర్ ఎన్నికలలో గొప్పగా పుంజుకున్న బీజేపీ ...రెండవ అతిపెద్ద పార్టీగా అవతరణ


జిహెచ్ఎంసి ఎన్నికలలో ఈ సారి అనూహ్య ఫలితాలు వచ్చాయి..గత ఏడాదిలాగే తెరాస విజయం సాధించినప్పటికీ సీట్లు మాత్రం గత సారి కంటే చాలా తగ్గాయి , ఇక కాంగ్రెస్ ఈ ఎన్నికలతో తెలంగాణ మరింత పట్టుకోల్పోయిన విషయం స్పష్టంగా అర్థమవుతుంది..ఇక మరోవైపు ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను శాసించిన టిడిపి ని గ్రేటర్ ఓటర్లు పూర్తిగా మర్చిపోయారు..

ఇక ఎంఐఎం మాత్రం తన బలం ఉన్న చోట ఎప్పటిలాగే తన పట్టు నిలబెట్టుకుంది..ఇక ఈ ఎన్నికలలో అత్యంత షాకింగ్ అంటే బీజేపీ పార్టీ అని చెప్పవచు ...గత జిహెచ్ఎంసి ఎన్నికలలో కేవలం నాలుగు స్థానాలు మాత్రమే దక్కించుకున్న బీజేపీ ఈ సారి మాత్రం గొప్పగా పుంజుకొని గ్రేటర్ ఎన్నికలలో రెండవ అతి పెద్ద పార్టీగా అవతరించింది...

కానీ పాత బస్తీలో మాత్రం పాగా వేయలేకపోయింది. అమిత్‌ షా భాగ్యలక్ష్మీ ఆలయం సందర్శించినప్పటికి పెద్దగా ఫలితం లేకపోయింది. ఇక ఇప్పటికి పాతబస్తీలో తమకు తిరుగు లేదని పతంగి పార్టీ మరోసారి రుజువు చేసుకుంది. ఈ సారి ఎంఐఎం మూడో స్థానానికి పరిమితమయ్యింది. అయినప్పటికి మేయర్‌ ఎన్నికల్లో ఎంఐంఎ కీలక పాత్ర పోషించనుంది

Tags :
|
|

Advertisement