Advertisement

  • తెలంగాణాలో బీజేపీ జెండా పాతడం కాయం ...బీజేపీ చీఫ్ జెపి నడ్డా

తెలంగాణాలో బీజేపీ జెండా పాతడం కాయం ...బీజేపీ చీఫ్ జెపి నడ్డా

By: Sankar Sat, 28 Nov 2020 12:10 PM

తెలంగాణాలో బీజేపీ జెండా పాతడం కాయం ...బీజేపీ చీఫ్ జెపి నడ్డా


జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన బీజేపీ చీఫ్ నడ్డా మీడియా సమావేశంలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ అభివ‌ృద్ధిని చూసి తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి మేయర్ పీటం కైవసం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.

2019 ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకున్నామని, ఇప్పుడు దుబ్బాక దెబ్బతో తెలంగాణలో బీజేపీ మరింత మెరుగైందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బీజేపీకి మద్ధతు తెలిపిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దీనికి ముందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జేపీ నడ్డా అన్నిడివిజన్ల‌లో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు.

కొత్తపేట నుంచి నాగోల్ వరకు రోడ్‌ షోలో పాల్గొన్నారు. కేవలం మునిసిపల్ ఎన్నికల కోసం బీజేపీ జాతీయ నాయకులు ప్రచారం చేస్తున్నారని కొన్ని పార్టీలు బహిరంగంగా విమర్శించినా.. కమలాన్ని వికసింపజేసేందుకు మేము ఎక్కడికైనా వస్తామని ప్రకటించారు. అశేషంగా వచ్చిన ప్రజలను చూస్తుంటే తెలంగాణలో రాబోయే కాలంలో బీజేపీ జెండా పాతడం కాయమన్నారు

Tags :

Advertisement