Advertisement

  • దుబ్బాక ఫలితం కూడా అదే స్థాయిలో ఉండాలి ...బీజేపీ చీఫ్ బండి సంజయ్

దుబ్బాక ఫలితం కూడా అదే స్థాయిలో ఉండాలి ...బీజేపీ చీఫ్ బండి సంజయ్

By: Sankar Thu, 29 Oct 2020 7:57 PM

దుబ్బాక ఫలితం కూడా అదే స్థాయిలో ఉండాలి ...బీజేపీ చీఫ్ బండి సంజయ్


సిద్దిపేట జిల్లాలోని మిరుదొడ్డిలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా..బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ ఎన్నికలు దుబ్బాక ఎన్నికలు కావని.. రాష్ట్రమంతా మీ దుబ్బాక వైపు చూస్తుందన్నారు.

బిజెపికి ఓటు వేసి రఘునందన్ రావును గెలిపించాలని కోరారు. సారు, కారు, పదహారు అన్నారని..కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు తో కెసిఆర్ కు మాటలు రాలేదని పేర్కొన్నారు. దుబ్బాక ఫలితం కూడా అదే మాదిరిగా ఉండాలని చెప్పారు. సీఎం కెసిఆర్ ఇంట్లో కొట్లాట జరుగుతుందని..అందుకే కెసిఆర్ ఫాం హౌస్ కు వెళ్తున్నాడు..ప్రజలు గమనించాలన్నారు. ఫాంహౌస్ నుంచి పరిపాలన చేసే ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరం లేదని..దుబ్బాక తీర్పు టీఆర్ఎస్ కు మైండ్ బ్లాక్ కావాలని తెలిపారు.

కాగా దుబ్బాక ఎమ్యెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి..సాధారణంగా అయితే ఉప ఎన్నికను అంతగా పట్టించుకోని ప్రతిపక్షాలు ఈ సారీ మాత్రం తెరాస కు తగిన పాఠం చెప్పాలని గట్టిగ ప్రయత్నిస్తున్నాయి..తెరాస కూడా అదే స్థాయిలో ప్రచారం చేస్తుంది..మరి దుబ్బాక ప్రజలు ఎవరివైపు ఉంటారో మరికొద్ది రోజుల్లో తేలనుంది...

Tags :
|

Advertisement