Advertisement

  • అమిత్​ షా పర్యటన తో అక్కడ ప్రాధాన్యం సంతరించుకుంది...!

అమిత్​ షా పర్యటన తో అక్కడ ప్రాధాన్యం సంతరించుకుంది...!

By: Anji Sat, 19 Dec 2020 1:04 PM

అమిత్​ షా పర్యటన తో అక్కడ ప్రాధాన్యం సంతరించుకుంది...!

రెండు రోజుల పర్యటన నిమిత్తం. బెంగాల్ కు చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. అధికార తృణమూల్​ కాంగ్రెస్​లో అంసతృప్త నేతల రాజీనామాల పర్వం కొనసాగుతున్న క్రమంలో షా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

రాష్ట్ర వ్యవహారాలపై సమీక్షించేందుకే హోంమంత్రి వస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నా.. టీఎంసీ నేతల చేరికలే లక్ష్యంగా ఈ పర్యటన చేపడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు బంగాల్​ అధికార తృణమూల్​ కాంగ్రెస్​లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే.. పలువురు కీలక నేతలు పార్టీకి స్వస్తి పలికారు.

టీఎంసీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్​ నేత సువేందు అధికారి.. అమిత్​ షా పర్యటన సందర్భంగానే కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారని గుసగుసలు వినబడుతున్నాయి.

ఆయనతో పాటు శిలభద్ర దత్తా, జితేంద్ర తివారీ, బనాసరి మైతీ వంటి కొంత మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. వీరితో పాటు అసంతృప్త టీఎంసీ నాయకులూ కమలదళంలో చేరతారని సమాచారం.

Tags :

Advertisement