Advertisement

  • కమీషనర్ కార్యాలయం దగ్గర బీజేపీ శ్రేణులు ధర్నా

కమీషనర్ కార్యాలయం దగ్గర బీజేపీ శ్రేణులు ధర్నా

By: Sankar Mon, 30 Nov 2020 3:18 PM

కమీషనర్ కార్యాలయం దగ్గర బీజేపీ శ్రేణులు ధర్నా


గ్రేటర్ హైదరాబాద్ లో మరికొన్ని గంటల్లో ఎన్నికలు జరగనున్నాయి...దుబ్బాక లో అనూహ్య ఓటమితో తెరాస ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది..మరోవైపు దుబ్బాక విజయంతో తెలంగాణాలో తమ ఉనికిని పెంచుకోవడానికి బీజేపీ ఇంతకంటే మంచి అవకాశం దొరకదు అని భావిస్తుంది...

ఇక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు టీఆర్‌ఎస్‌ పార్టీకి కొమ్ము కాస్తున్నారని బీజేపీ శ్రేణులు నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ డబ్బులు, మద్యం విచ్చలవిడిగా పంచినా వారిపై కేసులు నమోదు చేయడం లేదని రఘునందన్ రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ ఆగడాలపై ప్రశ్నించిన తమపై కేసులు నమోదు చేసి దాడులు చేస్తున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు.

కాగా మాన్సూరాబాద్ డివిజన్‌లో మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉన్న ఇంటిని బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. డివిజన్ నుంచి వెళ్లిపోవాలంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సూర్యాపేట నుంచి వచ్చిన వాళ్ల వెంటనే వెళ్లిపోయి, ప్రజాస్వామ్యాన్ని కాపాడలంటూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మంత్రి జగదీశ్వర్ రెడ్డిలతో పాటు తెరాస నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని బీజేపీ అభ్యర్థి కొప్పుల నరసింహరెడ్డి అన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడినుండి మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వెనుదిరిగారు.

Tags :

Advertisement