గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ 21 మంది అభ్యర్థుల జాబితా ప్రకటన
By: chandrasekar Thu, 19 Nov 2020 10:32 AM
హైదరాబాద్ లో మునిసిపల్
ఎన్నికల ప్రకటించడంతో వివిధ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను విదుదల చేస్తుంది.
ప్రస్తుతం బీజేపీ 21 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. గ్రేటర్
హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సందడి మరింత రంజుగా మారుతోంది.
బీజేపీ బుధవారం రాత్రి 21 మంది
అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్లు
తమ అభ్యర్థులను ప్రకటించాయి. టీఆర్ఎస్ 105 మందితో తొలి జాబితాను విడుదల చేయగా కాంగ్రెస్ 29
మందితో తొలి జాబితాను విడుదల చేసింది.
దాని తరువాత మరో 16
మందితో రెండో జాబితాను కూడా కాంగ్రెస్ రిలీజ్ చేసింది. దీంతో ఇప్పటివరకు కాంగ్రెస్
45 మంది
అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ ఎన్నికల విజయంపై వివిధ పార్టీలు తమ తమ ధీమాను
వ్యక్తపరుస్తున్నాయి. ప్రజల తీర్పు ఏ పార్టీ వైపు ఉంటుందో వేచి చూడాల్సిందే.