Advertisement

  • ఆ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదు ...ఎమ్యెల్సీ కవిత

ఆ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదు ...ఎమ్యెల్సీ కవిత

By: Sankar Thu, 19 Nov 2020 11:56 PM

ఆ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదు ...ఎమ్యెల్సీ కవిత


జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నగరవాసులను ఓటు అడిగే హక్కు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వరద బాధితులకు సహాయాన్ని బలవంతంగా అడ్డుకున్న ఇరుపార్టీలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. ముషీరాబాద్‌ పరిధి గాంధీనగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముఠా పద్మా నరేశ్‌ నేడు నామినేషన్‌ దాఖలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. నామినేషన్‌ దాఖలకు ముందు స్థానిక లక్ష్మి గణపతి ఆలయంలో పూజలు నిర్వహించారు. నామినేషన్‌ దాఖలు అనంతరం చేపట్టిన ఎన్నికల ప్రచారంలో కవిత పాల్గొని మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు గాంధీనగర్‌ డివిజన్‌తో ప్రారంభమౌతుందన్నారు.

పేద ప్రజలకు ప్రభుత్వ సాయాన్ని అడ్డుకున్న జాతీయ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. వరద బాధితుల కష్టాలకు చలించిన రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి సహాయం అందిస్తుంటే మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వకపోగా రాష్ట్ర ప్రభుత్వం చేసే సహాయాన్ని సైతం అడ్డుకుందన్నారు.

Tags :
|
|
|

Advertisement