Advertisement

  • కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు

కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు

By: chandrasekar Wed, 09 Dec 2020 9:51 PM

కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు


మంత్రి కేటీఆ‌ర్ ఎల్లారెడ్డి పేటలో మున్నూరు కాపు సంఘ భవనాన్ని ప్రారంభించేందుకు, ఓ కార్యకర్త పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చిన సమయంలో బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. డిగ్రీ కళాశాల కావాలంటూ వారు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. పోలీసులు బీజేపీ కార్యకర్తలందర్నీ అదుపులోకి తీసుకున్నారు.

టీఆర్ఎస్ కార్యకర్తలు రంగంలోకి దిగారు. బీజేపీ నేతల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ వారిపై దాడికి దిగారు. నలుగురు బీజేపీ కార్యకర్తలపై దాడిచేసి, వారి ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో సాయికుమార్ అనే బీజేపీ కార్యకర్త గాయపడ్డారు. ఇరువర్గాల ఆందోళనలతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన తమపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

పార్టీకి సంబంధం లేని మైనార్టీ యువకుడిపై మంత్రి సమక్షంలోనే టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని, మంత్రి కేటీఆర్ దాడికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పిన తరువాత అక్కడ నుంచి వెళ్లారు.

Tags :
|
|
|

Advertisement