Advertisement

  • అడ్వాన్స్‌డ్‌ స్టాటిస్టికల్‌ లెర్నింగ్‌ టెక్నిక్స్ ద్వారా అమెరికాను దాటేస్తామన్న బిట్స్ పిలానీ సర్వే

అడ్వాన్స్‌డ్‌ స్టాటిస్టికల్‌ లెర్నింగ్‌ టెక్నిక్స్ ద్వారా అమెరికాను దాటేస్తామన్న బిట్స్ పిలానీ సర్వే

By: chandrasekar Sat, 12 Sept 2020 09:21 AM

అడ్వాన్స్‌డ్‌ స్టాటిస్టికల్‌ లెర్నింగ్‌ టెక్నిక్స్ ద్వారా అమెరికాను దాటేస్తామన్న బిట్స్ పిలానీ సర్వే


అడ్వాన్స్‌డ్‌ స్టాటిస్టికల్‌ లెర్నింగ్‌ టెక్నిక్స్ ద్వారా అమెరికాను దాటేస్తామని బిట్స్ పిలానీ ప్రెడిక్ట్ చేసింది. అన్ లాక్ వల్ల కరోనా అమాంతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దేశంలో శుక్రవారం, సెప్టెంబర్ 11 న కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 96,551. వరుసుగా రెండో రోజు 95 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే వారం లోగా రోజుకు లక్ష కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. అంటే భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచంలో ఏ దేశంలోనూ కరోనా కేసులు ఈ స్థాయిలో నమోదు కావడంలేదు. పాజిటివ్ కేసుల విషయంలో ఇప్పటివరకు అమెరికా మొదటి స్థానంలో ఉంది. భారత్‌లో కేసుల ఒరవడి ఇదేవిధంగా కొనసాగితే అమెరికాను కూడా వెనక్కి నెట్టేస్తామని ఇప్పుడు చర్చ జరుగుతోంది. కానీ అందుకు ఎంతో కాలం పట్టదట.

కరోనా కేసుల విషయంలో మనం అక్టోబర్ మొదటి వారంలోనే అగ్రరాజ్యాన్ని దాటేస్తామమని హైదరాబాద్‌కు చెందిన ప్రతిష్టాత్మక బిట్స్ పిలానీ విద్యా సంస్థ ఈ విషయాన్ని చెప్పింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నిర్ధారణ అయిన దేశాల జాబితాలో అమెరికా తొలిస్థానంలో ఉండగా భారత్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది. దేశంలో ప్రస్తుత వ్యాప్తి ఇలాగే కొనసాగితే అక్టోబర్‌ మొదటి వారంలో అమెరికాను సైతం భారత్‌ వెనక్కి నెట్టివేయనుందని బిట్స్‌ పిలానీ అంచనా వేసింది. ప్రస్తుతం అమెరికాలో సుమారు 65 లక్షల కేసులు ఉన్నాయి. భారత్‌లో శుక్రవారం కేసులతో 45 లక్షల 62 వేలు దాటాయి. కేసులు ఇదే తీరున నమోదైతే ఈ సంఖ్య అక్టోబర్‌ నాటికి 70 లక్షలు దాటే అవకాశం ఉందని బిట్స్ పిలానీ తెలిపింది. ఇది అధిక వ్యాప్తిగా చెప్పబడుతుంది.

ఎనాలిసిస్ కోసం అడ్వాన్స్‌డ్‌ స్టాటిస్టికల్‌ లెర్నింగ్‌ టెక్నిక్స్ విధానాన్ని ఉపయోగించి కొవిడ్‌ కేసుల సంఖ్యను అంచనా వేసినట్లు వెల్లడించింది. అధ్యయనానికి సంబంధించిన పరిశీలనలను ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌’కు పంపినట్లు బిట్స్ పిలానీకి చెందిన డాక్టర్‌ టి.ఎస్‌.ఎల్‌. రాధిక తెలిపారు. అప్లైడ్‌ మ్యాథమేటిక్స్‌ విభాగానికి చెందిన పరిశోధకురాలైన రాధిక.. ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు. అయితే.. ఈ కేసుల సంఖ్య టెస్టుల సంఖ్యపై ఆధారపడి ఉంటుందని ఆమె వివరించారు. దీర్ఘకాలంలో కేసుల సంఖ్యను అంచనా వేసేందుకు మరింత మెరుగైన విధానాన్ని రూపొందించే పనిలో ఉన్నామని ఆమె తెలిపారు. దేశంలో ప్రస్తుతం 9 లక్షల 43 వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 35 లక్షల మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

పెరుగుతున్న కేసుల వల్ల కరోనా మరణాల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 1209 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 76,271కి ఎగబాకింది. మరోవైపు కొవిడ్‌-19తో మరణిస్తున్న వారిలో సుమారు 70 శాతానికిపైగా మంది ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనని కేంద్ర ఆరోగ్యశాఖ చెబుతోంది. అంతేకాకుండా దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షలు భారీగా నిర్వహిస్తుండడంతో, అధిక సంఖ్యలో పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నట్లు వ్యాఖ్యానించింది. దేశంలో ఇప్పటివరకు 5 కోట్ల 40 లక్షల శాంపిళ్లకు కొవిడ్‌ టెస్టులు పూర్తిచేసినట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది. గణనీయంగా చోటుచేసుకున్న మార్పులవల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Tags :
|
|
|

Advertisement