- హోమ్›
- వార్తలు›
- కోట్లా స్టేడియంలో అరుణ్ జైట్లీ విగ్రహం పెడితే నా సభ్యత్వం తీసేయండి..బిషన్ సింగ్ బేడీ ఆగ్రహం
కోట్లా స్టేడియంలో అరుణ్ జైట్లీ విగ్రహం పెడితే నా సభ్యత్వం తీసేయండి..బిషన్ సింగ్ బేడీ ఆగ్రహం
By: Sankar Wed, 23 Dec 2020 11:39 AM
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విగ్రహాన్ని ప్రతిష్టించాలని భావిస్తున్నారు. డీడీసీఏ అధ్యక్షుడిగా జైట్లీ సుమారు 14 ఏళ్ల పాటు కొనసాగారు.
అయితే అరుణ్ జైట్లీ విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకున్న డీడీసీఏ ప్రణాళిక పట్ల మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైట్లీ విగ్రహ ఏర్పాటుకు నిరసన తెలుపుతూ డీడీసీఏకే బేడీ లేఖ రాశారు. ఫిరోజ్ షా స్టేడియంలో ఓ స్టాండ్స్కు ఉన్న తన పేరును తొలగించాలన్నారు.
2017లో స్టేడియంలోని ఓ స్టాండ్స్కు బేడీ పేరును పెట్టారు.అంతేకాదు తనను డీడీసీఏ సభ్యత్వం నుంచి తొలగించాలని కూడా కోరారు. డీడీసీఏలో బంధుప్రీతి పెరిగిందని, క్రికెటర్లను మరిచి పరిపాలకులను ప్రమోట్ చేస్తున్నారని బేడీ తన లేఖలో ఆరోపించారు. డీడీసీఏ సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్లు బేడీ చెప్పారు.