- హోమ్›
- వార్తలు›
- కాళ్లు, చేతులు బాగానే ఉన్నా వీల్ఛైర్లో కూర్చొని భిక్షాటన చేస్తున్న కోటీశ్వరురాలు...!
కాళ్లు, చేతులు బాగానే ఉన్నా వీల్ఛైర్లో కూర్చొని భిక్షాటన చేస్తున్న కోటీశ్వరురాలు...!
By: chandrasekar Mon, 02 Nov 2020 3:11 PM
ఈజిప్టులో 57 ఏళ్ల
ఓ మహిళ అంగవైకల్యం ఉన్నట్లు నటిస్తూ భిక్షాటన చేస్తోందని కొంత మంది ఫిర్యాదు
చేశారు. ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు. దివ్యాంగురాలిగా నటిస్తూ
వీల్ఛైర్లో కూర్చొని భిక్షాటన చేస్తు్న్న ఆమె సాయంత్రం కాగానే వీల్ఛైర్ పక్కన
పెట్టేసి, చక్కగా
నడుచుకుంటూ వెళ్లిపోతోందని, ప్రజలను మోసం చేస్తోందని ఫిర్యాదుదారుల ఆరోపణ. ఈ
ఘటనపై విచారణ చేపట్టిన ఈజిప్టు పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. జనం
అనుమానిస్తున్నట్టుగానే ఆ మహిళ భిక్షగత్తె కాదని ఈజిప్టు పోలీసులు తేల్చారు. ఆమెకు
కోట్ల రూపాయల ఆస్తి పరురాలని, ఆమెకు 5 భవంతులు ఉన్నాయని పోలీసుల విచారణలో తేలింది. అయినా..
ఆమె ఎందుకు యాచిస్తుందనే అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా
ప్రకటించింది.
నఫీసా అనే మహిళ
ఈజిప్టులోని పలు ప్రావిన్స్లలో గత కొన్నేళ్లుగా వీల్ఛైర్లో కూర్చొని భిక్షాటన
చేస్తోంది. సాయంత్రం కాగానే వీల్ఛైర్ పక్కన పెట్టేసి, చక్కగా
నడుచుకుంటూ వెళ్తున్నట్లు కొంత మంది గమనించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో
పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తనకు పక్షవాతం వల్ల ఓ కాలు
పోయినట్లు నఫీసా చెప్పింది అబద్దమేనని పోలీసులు తేల్చారు. గర్బియా, ఖలిబుయా
గవర్నరేట్స్లో ఆమెకు ఐదు నివాస భవనాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
నఫీసాకు చెందిన రెండు బ్యాంక్ అకౌంట్లలో 3 మిలియన్ ఈజిప్షియన్ పౌండ్స్ (భారత కరెన్సీలో
సుమారు రూ.1.42 కోట్లు) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరింత లోతుగా
దర్యాప్తు జరిపి కోటీశ్వరురాలైన ఆ యాచకురాలిని కోర్టులో హాజరు పరుస్తామని ఈజిప్టు
పోలీసులు పేర్కొన్నారు.