- హోమ్›
- వార్తలు›
- ప్రపంచం మొత్తానికి సరిపడా కరోనా వాక్సిన్ తయారు చేయగల సత్తా భారత్ వద్ద ఉంది ..బిల్ గేట్స్
ప్రపంచం మొత్తానికి సరిపడా కరోనా వాక్సిన్ తయారు చేయగల సత్తా భారత్ వద్ద ఉంది ..బిల్ గేట్స్
By: Sankar Thu, 16 July 2020 3:29 PM
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అన్ని దేశాలను వణికిస్తోంది ..వాక్సిన్ లేకపోవడంతో కరోనా కేసులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు ..అయితే ఈ వ్యాధి నిర్మునలకు ప్రపంచ దేశాలు వాక్సిన్ తీసుకురావడనికి అనేక ప్రయోగాలు చేస్తున్నాయి ..ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ఫార్మా రంగాన్ని ఆకాశానికెత్తారు. తమ దేశానికే కాక మొత్తం ప్రపంచానికి సరిపడా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయగల సత్తా భారత్కు ఉందని తెలిపారు.
వ్యాక్సిన్ అభివృద్ధి కోసం భారత్లో ఇప్పటికే చాలా ముఖ్యమైన పరిశోధనలు జరిగాయని.. ఇతర వ్యాధుల కోసం ఉపయోగించిన పలు కాంబినేషన్లతో కరోనాకు వ్యాక్సిన్ రూపొందించడానికి భారత్ ఫార్మా కంపెనీలు కృషి చేస్తున్నాయని తెలిపారు. ‘ఇండియాస్ వార్ ఎగెనెస్ట్ ది వైరస్’ అనే డాక్యుమెంటరీలో మాట్లాడుతూ బిల్ గేట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు సాయంత్రం డిస్కవరీ చానెల్లో ఈ డాక్యుమెంటరీ ప్రసారం అవుతుంది.
బిల్ గేట్స్ మాట్లాడుతూ.. ‘కరోనా ప్రభావం భారతదేశం మీద కూడా భారీగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ జనాభా ఎక్కువ. అలానే పట్టణ ప్రాంతాల్లో జనసాంద్రత అధికంగానే ఉంటుంది. భారతదేశంలో డ్రగ్, వ్యాక్సిన్ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. భారత్లోని ఫార్మా కంపెనీలు ప్రపంచానికి అవసరమయిన వ్యాక్సిన్లను భారీ మొత్తంలో ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తున్నాయి.
సీరమ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభమైన తర్వాత భారతదేశంలో ఉత్పత్తి అయినంత భారీగా వ్యాక్సిన్లు ప్రపంచంలో మరెక్కడా తయారు కాలేదు. ఇదే కాక బయో ఈ, భారత్(బయోటెక్) వంటి ఎన్నో ప్రసిద్ధ ఫార్మా కంపెనీలు భారతదేశంలో ఉన్నాయి. ఒక్కటి మాత్రం నమ్మకంగా చెప్పగలను. తన ప్రజలకే కాక మొత్తం ప్రపంచానికి సరిపడా కరోనా వ్యాక్సిన్ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం భారత్ సొంతం’ అన్నారు బిల్ గేట్స్.