Advertisement

  • ఎవరో చేసిన నిర్లక్ష్యానికి అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన యువకుడు

ఎవరో చేసిన నిర్లక్ష్యానికి అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన యువకుడు

By: Sankar Mon, 14 Sept 2020 11:58 AM

ఎవరో చేసిన నిర్లక్ష్యానికి అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన యువకుడు


ఒక్కోసారి కొందరు చనిపోయింది చూస్తే ఆశ్చర్యం తో పాటు చుసిన ప్రతి ఒక్కరికి బాధ కలుగుతుంది..ఎటువంటి తప్పు చేయకున్నా కూడా కొందరు అన్యాయంగా చనిపోతూ ఉంటారు..ఆలా రోడ్ మీద బైక్ పైన వెళ్తున్న ఇద్దరు యువకులు మెట్రో చేసిన నిర్ల‌క్ష్యం వ‌ల్ల బైక్ ప్ర‌మాదానికి గుర‌య్యారు..రోడ్ మీద మెట్రో పనులు జరుగుతుండగా వాహనదారులకు ఇబ్బంది కలగకుండా మెట్రో యాజమాన్యం బారికేడ్లు ఏర్పాటు చేసింది..

ఆ బారికేడ్ల పక్కనుంచి ఎంతో మంది వెళ్లారు వారి ఎవ‌రికి ఏమీ కాలేదు. వీళ్ల‌ ఆయుష్షు తీరిన‌ట్టు ఉంది. మెట్రో బారికేడ్ ఒక్క‌సారిగా బైక్ మీద ప‌డింది. దీంతో బండి అదుపుత‌ప్పి ప‌క్క‌నే ఉన్న లారీకింద ప‌డ్డారు. వీరిలో ఒక‌రు మృతి చెందారు. ఈ బారీకేడ్‌ల‌ను మెట్రో ప‌నుల్లో భాగంగా ఏర్పాటు చేసిన‌ట్లు స‌మాచారం. ఏర్పాటు చేయ‌డం త‌ప్పులేదు. కానీ గ‌ట్టిగా ఏర్పాటు చేయ‌క‌పోవ‌డం త‌ప్పు అంటున్నారు చూసిన నెటిజ‌న్లు.

ఏదేమైనా ఎవ‌రో చేసిన ప‌నికి నిండు ప్రాణాలు బ‌ల‌య్యాయి. ఈ సంఘ‌ట‌న ముంబైలోని కండివాలీలో చోటు చేసుకున్న‌ది. ఈ సంఘ‌ట‌న మొత్తం అక్క‌డున్న సీసీకెమెరాలో రికార్డు అయింది. ఇప్పుడు ఇది సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది.

Tags :
|
|
|

Advertisement