Advertisement

  • పెట్రోల్ కొట్టించుకుంటున్న బైక్ లో ఒక్కసారిగా మంటలు ..భయంతో పరుగులు

పెట్రోల్ కొట్టించుకుంటున్న బైక్ లో ఒక్కసారిగా మంటలు ..భయంతో పరుగులు

By: Sankar Mon, 28 Sept 2020 10:04 PM

పెట్రోల్ కొట్టించుకుంటున్న బైక్ లో ఒక్కసారిగా మంటలు ..భయంతో పరుగులు


పెట్రోల్‌ కొట్టించుకోవడానికి బైక్‌పై పెట్రోల్‌ బంక్‌కు వచ్చాడో వ్యక్తి.. ఆ వెంటనే ఆ బైక్‌కు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అక్కడున్నవారు కొందరు పరుగులు పెట్టగా.. పెట్రోల్ బంక్‌ సిబ్బంది మంటలు ఆర్పివేసిన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలోని జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. ధర్మపురిలోని ఓ పెట్రోల్‌ బంక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. బైక్‌కు మంటలు అంటుకున్నాయి.. పెట్రోల్ కోసం వచ్చిన ద్విచక్రవాహనానికి ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో.. అక్కడికి వచ్చిన కొందరు కస్టమర్లు పరుగులు పెట్టారు.. బైక్‌పై వచ్చిన వ్యక్తి కూడా పరుగులు తీశాడు.

అయితే, మంటలు ఎలా చెలరేగాయి... కారణం ఏంటి లాంటి పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది. మొత్తానికి సకాలంలో పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది స్పందించి మంటలు ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది.

Tags :
|
|

Advertisement