బీహార్ లో ఉప ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ
By: Sankar Sun, 15 Nov 2020 7:25 PM
బిహార్లో నూతన ప్రభుత్వం కొలువుదీరేందుకు ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. ఎన్డీయే కూటమి తరుఫున ముఖ్యమంత్రిగా జేయూడీ అధినేత నితీష్ కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆయనతో పాటు మరికొంత మంది మంత్రులు సైతం ప్రమాణం చేసే అవకాశం ఉంది. అయితే బిహార్ డిప్యూటీ సీఎం పదవిపై కొంత ఉత్కంఠ నెలకొంది. గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సుశీల్ మోదీ స్థానంలో ఇద్దరు కొత్త వ్యక్తులను నియమిస్తారని తెలుస్తోంది.
వీరిలో ప్రధానంగా బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే తారక్ కిషోర్ ప్రసాద్తో పాటు రేణు దేవి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ నితీష్తో పాటు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. మరోవైపు స్వీకర్ పదవి సైతం బీజేపీకే దక్కే అవకాశం ఉంది..అయితే సుశీల్ మోదీ ఎందుకు తప్పుకున్నారు అనేది తెలియాల్సి ఉంది. బీజేపీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. డిప్యూటీ సీఎం పదవిపై సుశీల్ అంతగా ఆసక్తి చూపడంలేనట్లు తెలుస్తోంది