జేడీయూ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న బీహార్ సీఎం నితీష్ కుమార్
By: Sankar Sun, 27 Dec 2020 10:00 PM
బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ రాజకీయపరంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. జేడీయూ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ఉన్నతాధికారి ఆర్సీపీ సింగ్కు జేడీయూ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.
2019లో పార్టీ చీఫ్గా తిరిగి ఎన్నికైన నితీష్ పదవీకాలం 2022 వరకు ఉన్నప్పటికీ ముందే తప్పుకున్నారు. అయితే ముఖ్యమంత్రిగా, పార్టీ పెద్దగా బాధ్యతలు ఒక్కరి వద్దే ఉండటం సరైనది కాదని పలువురు సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు.
దీంతో పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి నితీష్ తప్పుకున్నారు. ఈ మేరకు ఆదివారం పట్నాలో నిర్వహించిన జేడీయూ ముఖ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు...కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆర్సీపీ సింగ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడుగా కొనసాగుతున్నారు. రెండుసార్లు పెద్దల సభకు ఎంపికైన అనుభవం ఆయనకు ఉంది. .