కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రపంచానికి భారత్ సహాయపడుతుంది...పీఎం మోడీ
By: Sankar Sun, 27 Sept 2020 07:08 AM
కరోనా వైరస్కు చెక్ పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి.. అయితే, అందరిచూపు మాత్రం భారత్పైనే ఉంది.. ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా.. కోవిడ్ వ్యాక్సిన్ల తయారీలో భారత పాత్ర కీలకం కానుంది అంటూ బిల్గేట్స్ లాంటివారు కూడా వ్యాఖ్యానించారు.
ఇక, యూఎన్ సర్వసభ్య సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ప్రధాని మోడీ.. అతిపెద్ద టీకా తయారీదారుగా భారతదేశం కోవిడ్-19ను అధిగమించడానికి ప్రపంచానికి సహాయం చేస్తుందన్నారు. ప్రపంచ సమాజానికి మరో హామీ ఇవ్వాలనుకుంటున్నా.. కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మానవులందరికీ సహాయపడటానికి భారత్ వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరా సామర్థ్యం ఉపయోగపడుందన్నారు.
కరోనా అనంతరం మారిన పరిస్థితుల్లో స్వయం సమృద్ధి భారత్ విజన్తో తాము ముందుకు వెళ్తున్నాం. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు స్వయం సమృద్ధి భారతం ఒక శక్తిలా నిలుస్తుందన్నారు ప్రధాని మోడీ.