ఇద్దరు యువకులపై పెద్దపులి దాడి...ఓ యువకుడ్ని అడవిలోకి లాక్కెళ్లిన పులి..
By: chandrasekar Wed, 11 Nov 2020 9:27 PM
కుమురం భీం జిల్లా దహేగాం
మండలం దిగెడ వద్ద ఇద్దరు యువకులపై పెద్దపులి దాడి చేయడం కలకలం రేపుతోంది. వారిలో ఓ
యువకుడ్ని పులి అడవిలోకి లాక్కెళ్లింది. దీంతో మరో యువకుడు భయంతో సమీపంలోని
గ్రామంలోకి పరిగెత్తాడు.
దహేగాం మండలం దిగెడ
సమీపంలో ఉన్న చెరువుకు ఇద్దరు యువకులు చేపల వేటకు వెళ్లారు. అక్కడికి వచ్చిన పెద్ద
పులి సీడాం విఘ్నేష్ (20) అనే యువకుడిపై దాడి చేసింది. అతణ్ని సమీపంలోని అటవీ
ప్రాంతంలోకి లాక్కెళ్లింది. అతని తుంటి భాగంపై విపరీతంగా గాయాలు చేసింది. దీంతో
యువకుడు చనిపోయినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనతో స్థానికులు తీవ్ర
భయాందోళనకు గురవుతున్నారు. యువకుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా
రోదిస్తున్నారు. ఏ క్షణాన ఏమౌతుందోనని ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని
బ్రతుకున్నారు. అటవీ అధికారులు చర్యలు తీసుకుని పెద్దపులిని బంధించాలని
వాపోతున్నారు.