Advertisement

  • కాంగ్రెస్ పార్టీ నుంచి మరో సీనియర్ నేత బీజేపీలోకి...!

కాంగ్రెస్ పార్టీ నుంచి మరో సీనియర్ నేత బీజేపీలోకి...!

By: Anji Thu, 17 Dec 2020 8:45 PM

కాంగ్రెస్ పార్టీ నుంచి మరో సీనియర్ నేత బీజేపీలోకి...!

తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. గ్రేటర్, దుబ్బక ఎన్నికల గెలుపుతో పార్టీ స్పీడు పెంచింది. అటు పలు ఇతర పార్టీలకు చెందిన నాయకులు సైతం కాషాయం వైపు చూస్తున్నారు.

తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి మరో సీనియర్ నేత బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో తొలినాళ్లలో కాంగ్రెస్ లోని కీలకమైన నేతలు ఆ పార్టీలోకి వెళ్లారు.

ఇక ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో.. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు. ఇదే సమయంలో బీజేపీ హవా కొనసాగింది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్‌లో పలువురు కీలక నేతలు బీజేపీ వైప చూస్తున్నారు.

టీఆర్ఎస్ కు ధీటుగా రాష్ట్రంలో బీజేపీ ఎదగడంతో కాంగ్రెస్ లోని నేతలంతా బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కు చెందిన రాష్ట్ర స్థాయి నేతలు.. మాజీ మంత్రులు.. ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు.

రోజురోజుకు ఈ క్యూ భారీగా పెరిగిపోతుంది. విజయశాంతి కూడా ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్ త్వరలోనే బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈనెల 28న బీజేపీ చేరుతున్నట్లు చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

అయితే ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అయ్యే పరిస్థితి ఉందని.. ఆ పార్టీలో అన్ని కులాల వారికి న్యాయం జరగడం లేదని చంద్రశేఖర్ ఆరోపించారు.

మరోవైపు బీజేపీకి ప్రజలంతా ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ పదవికి గ్రేటర్ ఫలితాలకు బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు టీపీసీసీ ఛీప్ విషయంలో ఆ పార్టీ ఇంకా ఓ క్లారిటీకి రాలేకపోతుంది.

Tags :

Advertisement