వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో మరోసారి బిగ్ షాక్...
By: chandrasekar Thu, 05 Nov 2020 1:10 PM
జగన్ సర్కారుకు ఇళ్ల
పట్టాలపై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆలయ భూముల్ని పేదలకు ఇళ్ల స్థలాల
కోసం ఇవ్వడంపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారన్ని వెంటనే
నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విజయనగరం జిల్లా
గుంపం గ్రామంలో ఆలయ భూముల్ని ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం కేటాయించింది.
ఇళ్ల స్థలాలకు ఇచ్చేందుకు
ఆలయ భూముల్ని భూమిని సిద్ధం చేస్తున్నారంటూ గుంపం గ్రామస్తులు హైకోర్టును
ఆశ్రయించారు. ఈ పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ
సందర్భంగా ప్రభుత్వానికి హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ఆలయ భూముల్ని ఇళ్ల
స్థలాలకు ఇచ్చే నిబంధన ఎక్కడ ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై 4
వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశించింది. అప్పటి
వరకు ఎలాంటి చర్యలు చేపట్టొద్దని అధికారులకు కోర్టు ఆదేశించింది.