- హోమ్›
- వార్తలు›
- ఫ్లిప్ కార్ట్లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభం.. మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్, టీవీలపై భారీ తగ్గింపు..
ఫ్లిప్ కార్ట్లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభం.. మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్, టీవీలపై భారీ తగ్గింపు..
By: chandrasekar Fri, 18 Dec 2020 11:21 AM
ఈ సంవత్సరం చివరి నెల
కావడంతో ఫ్లిప్ కార్ట్లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభం అయ్యింది. ఈ సేల్ లో
భారీగా తగ్గింపు ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ
తగ్గింపును ప్రకటించారు. ఇందుకోసం మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ మరియు LED స్మార్ట్
టీవీలపై భారీ ఆఫర్లను అందించారు. స్మార్ట్ ఎల్ఈడీ టీవీ కోసం పరిశీలిస్తే శాంసంగ్ కంపెనీ 55 అంగుళాల 4కే
స్మార్ట్ ఎల్ఈడీ టీవీపై భారీ తగ్గింపును
ప్రకటించారు. రూ.86,900 విలువైన ఈ టీవీ ను
రూ.62,590కి తగ్గించారు. ఎస్బీఐ కార్డుతో ఈ టీవీని కొనుగోలు
చేస్తే 10 శాతం
అదనపు డిస్కౌంట్ ను పొందవచ్చును. అలాగే ఐఫోన్ 11 ప్రో స్మార్ట్ ఫోన్పై రూ.26 వేల
తగ్గించారు. రూ.1,06,600 విలువైన ఈ ఫోన్ ను ఇప్పుడు రూ.79,999కే అందిచనున్నారు.
ప్రస్తుతం మార్కెట్ విలువ
రూ.55,999 కలిగిన అసుస్ రోగ్ ఫోన్ 3ని రూ.44,999కే అందించనున్నారు. అలాగే రూ.55,000 విలువైన ఎల్జీ వెల్వెట్ డ్యూయల్ స్క్రీన్ ఫోన్ ను రూ.39,990కే లభించనుంది. మొబైల్ ఫోన్ లలో పోకో ఎక్స్3 ధర
రూ.19,999 నుంచి రూ.15,999కు తగ్గించారు. ఎక్స్చేంజ్ ద్వారా సౌకర్యం ద్వారా
రూ.13,200 వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. యాపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ రూ.38,900కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ.47,900 గా వుంది. దీనిపై
ఏకంగా రూ.9 వేలు తగ్గింపును అందించారు. ఇక కంప్యూటర్ ల
విషయానికి వస్తే ల్యాప్ టాప్ రూ.54,990 విలువైన అసుస్ వివోబుక్ 14
ల్యాప్ టాప్ ను రూ.40,990కే కొనుగోలు చేయవచ్చు. ఎంఎస్ఐ జీఎఫ్63
గేమింగ్ ల్యాప్టాప్పై రూ.40 వేల తగ్గించారు. అసలు రేటు రూ.94,990 విలువైన ఈ ల్యాప్టాప్ ను ప్రస్తుతానికి రూ.54,990కే కొనుగోలు చేయవచ్చు.