సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి పెను ప్రమాదం: వెంకయ్య నాయుడు
By: chandrasekar Tue, 29 Dec 2020 9:44 PM
ప్రజలు ప్లాస్టిక్ ను
బాధ్యతారహితంగా పారవేయకుండా చూసుకోవాలి అని వెంకయ్య నాయుడు తెలిపారు. సింగిల్ యూజ్
ప్లాస్టిక్ వల్ల కలిగే పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. సోమవారం
కృష్ణా జిల్లా సూరంపల్లిలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్
అండ్ టెక్నాలజీ (సీఐపీఈటీ)లో అధ్యాపకులు, విద్యార్థులను ఉద్దేశించి వెంకయ్య నాయుడు మాట్లాడారు.
ప్లాస్టిక్ లేని జీవితం
ఊహించలేనిదిగా మారింది. ఇది ఇతర పాలిమర్లతో పాటు, పెట్రోకెమికల్స్ నుండి
ఏర్పడింది. కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది
ఒక పెద్ద పర్యావరణ ప్రమాదాన్ని కలిగి స్తుంది అని వెంకయ్య నాయుడు చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా సముద్ర పర్యావరణ వ్యవస్థ ప్లాస్టిక్ వ్యర్థాలతో కలుషితం
అవుతున్నదని ఆయన అన్నారు.