Advertisement

  • అమరావతిలో భూముల కొనుగోళ్ల వ్యవహారం వెనుక భారీ కుట్ర...

అమరావతిలో భూముల కొనుగోళ్ల వ్యవహారం వెనుక భారీ కుట్ర...

By: chandrasekar Wed, 23 Dec 2020 4:58 PM

అమరావతిలో భూముల కొనుగోళ్ల వ్యవహారం వెనుక భారీ కుట్ర...


అమరావతిలో భూముల కొనుగోళ్ల వ్యవహారం వెనుక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సభ్యుల భారీ కుట్ర ఉందని రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్ హైకోర్టుకు తెలియచేసారు. సీఐడీ భూముల కొనుగోళ్ల వ్యవహారంలో ఇటీవల నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సన్నిహితులు కిలారు రాజేశ్, ఆయన భార్య శ్రీహాస తది తరులు హైకోర్టులో వేర్వేరుగా క్రిమినల్‌ పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌ విచారణ జరిపి తీర్పు వాయిదా వేశారు. అయితే అమరావతి భూ కొనుగోళ్ల కుంభకోణం కేసులో కొందరు ఉద్యోగులు మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇచ్చారని వివరాలను కోర్టు ముందు ఉంచుతామని, వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ సీఐడీ అదనపు ఎస్‌పీ వాసంశెట్టి గోపాలకృష్ణ అదనపు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్‌ రాయ్‌ కేసును తిరిగి ఓపెన్‌ చేసారు. ఏజీ శ్రీరామ్ మంగళవారం సీఐడీ తరఫున‌ వాదనలు వినిపించారు. అమరావతిలో భూముల కొనుగోళ్ల కుంభకోణానికి సం బంధించి పలు కీలక విషయాలను ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీఆర్‌డీఏ చట్టం తీసుకురావడం, సీఆర్‌డీఏ ఏర్పాటు చేయడం, దాని పరిధి నిర్ణయించడం, అభివృద్ధి పనుల కొనసాగింపు బాధ్యతలు సీఆర్‌డీఏకి అప్పగించడం తదితరాలపై అప్పటి ప్రభుత్వం జారీ చేసిన ఆరు జీవోలకు సంబంధించిన నోట్‌ ఫైళ్లు ఏవీ కూడా పురపాలకశాఖలో తయావలేదని పేర్కొన్నారు. ఈ జీవోలను ఆ శాఖ ఉద్యోగులు తయారు చేయలేదని పలువురు ఉద్యోగులు సంబంధిత మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలాలు ఇచ్చారని వివరించారు.

రాజధానికి సంబంధించిన జీవోల తాలూకు నోట్‌ఫైళ్లను సీఎం హోదాలో చంద్రబాబు ఆమోదించి, వాటిపై సంతకం చేశారని వివరించారు. ఏ నిర్ణయాలపై జీవోలను జారీ చేశారో, ఆ నిర్ణయాలకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేవని ఏజీ తెలిపారు. ఈ నేపథ్యంలో కుట్ర కోణంలో చంద్రబాబు, అప్పటి ఆయన మంత్రివర్గ సభ్యుల పాత్రపై దర్యాప్తు చేయాల్సి ఉందని వివరించారు. పిటిషనర్లు దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేయాలని కోర్టును కోరారు. అంతకు ముందు పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. పిటిషనర్ల భూ కొనుగోళ్లన్నీ కూడా చట్ట నిబంధనలకు లోబడే జరిగాయన్నారు. పిటిషనర్ల తరఫున పలువురు ఇతర న్యాయవాదులు కూడా వాదనలు విన్పించారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.

Tags :
|
|

Advertisement