Advertisement

  • కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన బిగ్ బి అమితాబ్ బచ్చన్

కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన బిగ్ బి అమితాబ్ బచ్చన్

By: Sankar Sun, 02 Aug 2020 6:38 PM

కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన బిగ్ బి అమితాబ్ బచ్చన్



బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకున్నారు ..గత ఇరవై రోజులుగా కరోనా తో హాస్పిటల్లో ఉన్న బిగ్ బి కోలుకోవడంతో అభిమానులు ఆనందంలో ఉన్నారు .. కరోనా నుంచి అమితాబ్‌ బచ్చన్‌ కోలుకొని ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్‌తో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అమితాబ్‌.. నేడు పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.

ఇటీవల కరోనా పరీక్షల్లో అమితాబ్‌కు నెగటివ్‌ వచ్చిందనే నకలీ వార్త సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. దీని పై అమితాబ్‌ ఘాటుగానే స్పందించారు. బాధ్యతారాహిత్యంతో కూడిన వార్తలను ప్రచారం చేయవద్దని అమితాబ్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అమితాబ్‌ కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్, మనవరాలు ఆరాధ్యకు కూడా కరోనా సోకగా, ఇటీవలే ఐశ్వర్యరాయ్‌, ఆరాధ్య, ఇద్దరు కోలుకున్నారు.

అయితే బిగ్ బి తనయుడు అభిషేక్ బచ్చన్ మాత్రం ఇంకా కరోనా నుంచి కోలుకోలేదు ..అయన ప్రస్తుతం ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ..అయితే తాను కూడా త్వరలోనే కోలుకొని వస్తా అని అభిషేక్ బచ్చన్ ఆశాభావం వ్యక్తం చేసాడు ..

Tags :
|
|

Advertisement