Advertisement

  • రాబోయే రోజుల్లో కష్టాలు తప్పవు ..ప్రజలు అందరు జాగ్రత్తగా ఉండాలి ..భవిష్యవాణిలో స్వర్ణలత

రాబోయే రోజుల్లో కష్టాలు తప్పవు ..ప్రజలు అందరు జాగ్రత్తగా ఉండాలి ..భవిష్యవాణిలో స్వర్ణలత

By: Sankar Mon, 13 July 2020 12:03 PM

రాబోయే రోజుల్లో కష్టాలు తప్పవు ..ప్రజలు అందరు జాగ్రత్తగా ఉండాలి ..భవిష్యవాణిలో స్వర్ణలత



తెలంగాణాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పండుగ బోనాలు ..ఆషాడ మాసంలో రాజధానిలో అత్యంత వైభవంగా నిర్వహించే బోనాలు ఈ సారి కరోనా కారణంగా భక్తులు ఎవరు లేకుండానే జరుపుకోవాల్సి వస్తుంది ..బోనాలు పండుగలో అత్యంత ముఖ్యమైన ఘట్టం రంగం ..ఈ రంగం కార్యక్రమంలో దేవత వచ్చిన మహిళ భవిష్య వాని చెబుతారు ..ప్రతి ఏడాది ఈ భవిష్య వాని వినడంకోసం అనేక మంది భక్తులు తరలి వస్తారు ..

అయితే ఈ ఏడాది ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల్లో భాగంగా రంగం కార్యక్రమం నిర్వహించారు. కరోనాను కట్టడి చేసేందుకే తానునాన్నని, భక్తిభావంతో కొలిస్తేనే కాపాడుతానని స్వర్ణలత రంగం చెప్పారు.ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారు స్వర్ణలతను ఆవహించి భవిష్యవాణి వినిపించారు.

రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పవని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎవరు చేసుకున్న దానికి వాళ్లు అనుభవించక తప్పదు అని అన్నారు. ఐదు వారాలు సాకలు పోసి యజ్ఞహోమాలు చేయాలని ఆజ్ఞాపించారు. ఈఏడాది ఉత్సవాలు తనకు సంతోషంగా లేవని అన్నారు. గడపగడప నుంచి తనకు నైవేద్యాలు సమర్పించాలని చెప్పారు.

Tags :
|
|
|

Advertisement