Advertisement

దుబ్బాకలో బెట్టింగ్ రాయుళ్లు...!

By: Anji Tue, 10 Nov 2020 09:02 AM

దుబ్బాకలో బెట్టింగ్ రాయుళ్లు...!

దుబ్బాక ఉపఎన్నికలో విజేతెవరనేదానిపై తెలంగాణ రాష్ట్రంలోనేకాదు, ఆంధ్రప్రదేశ్ లోనూ ఆసక్తి నెలకొంది. ఇవాళ కౌంటింగ్ నేపథ్యంలో ప్రధానంగా దుబ్బాక శాసనసభ ఉపఎన్నిక ఫలితంపైనే చర్చ సాగుతోంది.

ఉప ఎన్నిక ఫలితాలపై ఎగ్జిట్‌పోల్‌ సర్వేలు భిన్నమైన రీతిలో వెలువడటంతో బెట్టింగ్‌ దందాలు బాగా పెరిగిపోయాయి. వివిధ పార్టీల గెలుపుపై నిన్న, ఇవాళ కోట్ల రూపాయలు బెట్టింగ్‌ జరుగుతున్నట్లు సమచారం.

శని, ఆదివారం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఖరీదైన కార్లు చక్కర్లు కొడుతూ ఓటర్ల నాడి ఎలా ఉందనేదానిపై అవగాహనకు వచ్చినట్టు వినికిడి. గెలుపోటములపై ప్రజలతో ఆరా తీయడం చాలాచోట్ల కనిపించింది.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చామని స్థానికులతో పరిచయం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఏనాడు బెట్టింగ్‌ సంస్కృతిలేని దుబ్బాక ప్రాంతంలోనూ స్థానికంగా కొంతమంది వేలు, లక్షల్లో పందేలకు దిగినట్టు తెలిసింది.

Tags :
|
|
|

Advertisement