Advertisement

  • శిరోముండనం కేసు, మాజీ ఐఏఎస్ పేరు వాడుకుని అడ్డంగా బుక్ ఐన నూతన్ నాయుడు అరెస్ట్

శిరోముండనం కేసు, మాజీ ఐఏఎస్ పేరు వాడుకుని అడ్డంగా బుక్ ఐన నూతన్ నాయుడు అరెస్ట్

By: chandrasekar Sat, 05 Sept 2020 1:19 PM

శిరోముండనం కేసు, మాజీ ఐఏఎస్ పేరు వాడుకుని అడ్డంగా బుక్ ఐన నూతన్ నాయుడు అరెస్ట్


నటుడు, నిర్మాత, బిగ్‌బాస్ కంటిస్టెంట్ నూతన్ నాయుడును విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో దళితుడికి శిరోముండనం కేసులో అరెస్టు చేసినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా వెల్లడించారు.

ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన్ నాయుడును కర్ణాటకలోని ఉడిపిలో అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అక్కడ అదుపులోకి తీసుకున్న అనంతరం ఉడిపి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. నూతన్ నాయుడును తమకు అప్పగించాలని కోర్టును కోరినట్లు తెలియచేసారు.

విశాఖపట్నంకు త్వరలోనే తీసుకురాబోతున్నట్లు సీపీ మనీష్ కుమార్ సిన్హా పేర్కొన్నారు. శిరోముండనం కేసులో కాక నూతన్ నాయుడు మరికొందరి పేర్లు వాడుకుని మోసాలకు పాల్పడ్డట్లు తెలిసిందని పేర్కొన్నారు.

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరుతో పోలీసులకు ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేయాలని చూశారని, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో అడ్డంగా బుక్కయ్యారని సీపీ తెలియచేసారు. ప్రస్తుతానికి నూతన్ నాయుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు చేస్తున్నామని, అసలు విషయాలు విచారణలో తెలుస్తాయని పేర్కొన్నారు.

Tags :

Advertisement