Advertisement

  • శాఖాహారిగా మారడం అత్యుత్తమన్న రకుల్‌ప్రీత్‌సింగ్

శాఖాహారిగా మారడం అత్యుత్తమన్న రకుల్‌ప్రీత్‌సింగ్

By: chandrasekar Wed, 04 Nov 2020 12:43 PM

శాఖాహారిగా మారడం అత్యుత్తమన్న రకుల్‌ప్రీత్‌సింగ్


ఆరోగ్య రీత్యా శాఖాహారిగా మారడం అత్యుత్తమమని ప్రముఖ నటి రకుల్‌ప్రీత్‌సింగ్ తెలిపింది. యోగా, ధ్యానం సాధన చేయడంతో పాటు ఏడాది క్రితం శాఖాహారిగా మారిపోవడం తన జీవన విధానాన్ని ప్రభావితం చేసిందని చెప్పింది పంజాబీ సొగసరి రకుల్‌ప్రీత్‌సింగ్‌. వృత్తిపరంగా ఎదురయ్యే సవాళ్ల గురించి తాను సానుకూల కోణంలో ఆలోచిస్తానని, నిరంతరం పనిచేస్తుండటమే తన సంతోషానికి కారణమని తెలిపింది. ప్రతి వక్కరు మానసికంగా ధృడంగా ఉండాలంటే మన వృత్తిలో నిమగ్నమైపోవాలి. ఏమైనా సమస్యలొచ్చినప్పుడు కుటుంబ సభ్యులు, సన్నిహితులతో చర్చించి సహాయం తీసుకుంటే మనసు తేలికపడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా యోగా, మెడిటేషన్‌ సాధన చేయడం వల్ల ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉండటం నేర్చుకున్నా అని రకుల్‌ప్రీత్‌సింగ్ చెప్పుకొచ్చింది‌. దీనివల్ల ప్రతికూల స్పందన కలుగుతున్నట్లు తెలిపింది.

మాంసాహారం కంటే శాకాహారం ఎంతో మేలైనదిగా పేర్కొంది. ఆమె శాఖాహారిగా మారిపోవడం తన జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయమని ఈ భామ చెప్పుకొచ్చింది. ఏడాది క్రితం శాఖాహారిగా మారిపోయా. మొదట ఒక నెల రోజుల పాటు ప్రయత్నించి చూద్దాం బాగనిపిస్తే శాఖాహారాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నా. ఆశ్చర్యకరంగా నెలరోజుల్లోనే నాలో చక్కటి మార్పులు కనిపించాయి. ముఖం మంచి వర్చస్సును సంతరించుకుంది. శరీరమంతా తేలికగా ఉన్న భావన కలిగింది. దాంతో ఇక శాఖాహారిగానే కొనసాగాలని ఫిక్పైపోయాను అని రకుల్‌ప్రీత్‌సింగ్‌ చెప్పింది. ప్రస్తుతం ఆమె తెలుగులో నితిన్‌ సరసన ‘చక్‌దే’ చిత్రంతో పాటు క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోంది. మరి ఎన్ని రోజులు ఈ శాఖాహారాన్ని పాటిస్తుందో వేచి చూడాల్సిందే.

Tags :

Advertisement