కారు ఉంటే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి
By: chandrasekar Mon, 09 Nov 2020 3:35 PM
కేంద్ర కొత్త రూల్స్ వల్ల
కారు పెట్టుకున్న అందరూ ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. మీకు కారుందా? అయితే
కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ
కొత్త రూల్ తీసుకువచ్చింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి కీలక నిర్ణయం
తీసుకుంది. దీంతో కారు కలిగిన వారు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం
టోల్ ప్లాజా రూల్స్ను సవరించింది. పాత వెహికల్స్కు కూడా ఫాస్టాగ్స్ను తప్పనిసరి
చేసింది. కొత్త రూల్స్ ప్రకారం 2021 జనవరి 1 నుంచి పాత వాహనాలు కూడా (2017కు
ముందు విక్రయించిన ఫోర్ వీలర్లు) కచ్చితంగా ఫాస్టాగ్స్ను కలిగి ఉండాలి. దీని కోసం
మోదీ సర్కార్ సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989ను సవరించింది.
టోల్ గేట్ ట్రాన్సక్షన్
డిజిటల్ లావాదేవీలగా మార్చడంవల్ల క్రమ బద్దీకరించబడనుంది. కాగా ఫాస్టాగ్స్ను ఉపయోగించడం వల్ల
వాహనదారులకు ప్రయోజనం కలుగనుంది. టోల్ ప్లాజాల వద్ద లైన్లో వాహనానలు
నిలుపుకోవాల్సిన పని లేదు. డైరెక్ట్గా వెళ్లొచ్చు. దీంతో ఇంధనం కూడా ఆదా
అవుతుంది. టోల్ డబ్బులు ఆటోమేటిక్గా అకౌంట్ నుంచి కట్ అవుతాయి. మీరు ఫాస్టాగ్
కొనుగోలు చేయాలని భావిస్తే నేషనల్ హైవే టోల్ ప్లాజాల వద్ద కొనుగోలు చేయొచ్చు.
లేదంటే బ్యాంకులు కూడా ఫాస్టాగ్ సర్వీసులు అందిస్తున్నాయి. మీరు బ్యాంకుకు వెళ్లి
ఫాస్టాగ్ను కొనుగోలు చేయొచ్చు. ఫినో పేమెంట్స్ బ్యాంక్, పేటీఎం
పేమెంట్స్ బ్యాంక్ వంటివి కూడా ఫాస్టాగ్ సేవలు ఆఫర్ చేస్తు్న్నాయి. ఒక్కో వెహికల్కు
ఒక్కో ఫాస్టాగ్ వాడాలి. వాహనాలను బట్టి రేట్లు నిర్ణయించబడి ఉంటాయి.