Advertisement

  • ధోని అభిమానులకు గుడ్ న్యూస్ ..ఫేర్ వెల్ మ్యాచ్ ఏర్పాటు చేసే ఆలోచనలో బీసీసీఐ

ధోని అభిమానులకు గుడ్ న్యూస్ ..ఫేర్ వెల్ మ్యాచ్ ఏర్పాటు చేసే ఆలోచనలో బీసీసీఐ

By: Sankar Thu, 20 Aug 2020 07:47 AM

ధోని అభిమానులకు గుడ్ న్యూస్ ..ఫేర్ వెల్ మ్యాచ్ ఏర్పాటు చేసే ఆలోచనలో బీసీసీఐ


ఇండియన్ దిగ్గజ ఆటగాళ్లలో ఒకడైన మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.సచిన్ తర్వాత ఆ స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న ధోని ఇలా అర్దాంతరంగా ఆట నుంచి తప్పుకోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు..ధోనికి కూడా సాచి లాగే అత్యంత భారీ స్థాయిలో రిటైర్మెంట్ ఉండాలని బీసీసీఐ అని అభిమానులు కోరుతున్నారు..

బీసీసీఐ కూడా తగిన రీతిలో అతనికి వీడ్కోలు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా, బోర్డు ఉన్నతాధికారి ఒకరు ఈ విషయం పరిశీలనలో ఉందని వెల్లడించారు. భారత క్రికెట్‌కు అతను చేసిన సేవలకు గుర్తింపుగా వీడ్కోలు మ్యాచ్‌ లేదా సిరీస్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ‘ఐపీఎల్‌ ముగిశాక ధోని కోసం చేయాల్సిందంతా చేస్తాం. దేశానికి అతను ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టాడు. అదే స్థాయిలో ధోనికి కూడా గౌరవం దక్కాలి. మేమెప్పుడూ ధోనికి వీడ్కోలు మ్యాచ్‌ ఉండాలనే అనుకున్నాం.

ఐపీఎల్‌ సందర్భంగా ధోనితో మాట్లాడి తనకు నచ్చినట్లు మ్యాచ్‌ లేదా సిరీస్‌ ఏర్పాటు చేస్తాం. అనంతరం అతనికి నచ్చినా నచ్చకపోయినా మేం ధోనిని సత్కరిస్తాం. ధోనికి సన్మానించడం మాకు దక్కిన గౌరవం’ అని ఆయన వ్యాఖ్యానించారు..

Tags :
|
|
|

Advertisement