Advertisement

  • బ్రేకింగ్ న్యూస్ ..విదేశాల్లో ఐపీయల్ నిర్వహించుకుంటాము అంటూ కేంద్రాన్ని అనుమతి కోరిన బీసీసీఐ ..

బ్రేకింగ్ న్యూస్ ..విదేశాల్లో ఐపీయల్ నిర్వహించుకుంటాము అంటూ కేంద్రాన్ని అనుమతి కోరిన బీసీసీఐ ..

By: Sankar Tue, 21 July 2020 5:16 PM

బ్రేకింగ్ న్యూస్ ..విదేశాల్లో ఐపీయల్ నిర్వహించుకుంటాము అంటూ కేంద్రాన్ని అనుమతి కోరిన బీసీసీఐ ..



అందరూ భావించినట్లు గానే ఐసీసీ టి ట్వంటీ ప్రపంచ కప్ను వాయిదా వేయడంతో బీసీసీఐ ఐపీయల్ నిర్వహణ పనులను వేగవంతం చేసింది ...అయితే ముందు ఊహించినట్లే ఐపీయల్ విదేశాలలో జరగనుంది ... భారత్‌లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో మ్యాచ్‌లను యూఈఏలో నిర్వహించాలని ఇదివరకే నిర్ణయించింది. దీంతో విదేశాల్లో లీగ్‌ నిర్వహణకు అనుమతిని కోరుతూ ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు..

దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందును ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించాం. సెప్టెంబర్‌- నవంబర్‌ మధ్యలో లీగ్‌ను నిర్వహించేందుకు షెడ్యూల్‌ను రూపొందించాం. విదేశీ గడ్డపై మ్యాచ్‌ల నిర్వహణకు భారత ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాలని కోరుతున్నాం.’ అని కేంద్ర ప్రభుత్వానికి మంగళవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో టీ-20 ప్రపంచ కప్‌ను వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ సోమవారం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే..

ఒక్క ఏడాది ఐపీఎల్‌ నిర్వహించకపోతే దాదాపు 4వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చే అవకాశం ఉందని అంచనా వేసిన క్రికెట్‌ పెద్దలు.. ఎలాగైనా లీగ్‌ నిర్వహించాలని పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఐసీసీ ప్రకటన అనుకూలంగా రావడంతో మ్యాచ్‌ల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కేంద్ర నుంచి అనుమతి రావడమే తరువాయి షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. కాగా దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా 2014లో తొలిసారి యూఏఈలో ఐపీఎల్‌-7ను నిర్వహించిన విషయం తెలిసిందే.

Tags :
|
|
|
|

Advertisement